BREAKING : ఈ నెల11 వ తేదీన జనగామ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

-

జనగామ జిల్లా : ఈ నెల 11వ తేదీన సిఎం కెసిఆర్ జనగామ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే… జనగామ నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్‌ కార్యాలయం లో పర్యటన ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇక ఈ సమావేశంలో.. ప్రాణాలిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తక్కెలపెల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్, వికలాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు. కాగా.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జ్వరం రావడం కారణంగా.. ప్రధాని టూర్‌ కు దూరం అయ్యారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news