BREAKING : ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

-

ఇవాళ హైదరాబాద్‌ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా… పఠాన్‌ చెరువులోని ఇక్రిశాట్ సెంటర్‌ కు చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా… ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ ప్లాంట్ ప్రొటెక్షన్ , రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ నీ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించారు ప్రధాని మోడీ. “మీకు 5 దశాబ్దాల అనుభవం ఉంది. ఈ 5 దశాబ్దాలలో మీరు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సహాయం చేసారు. మీ పరిశోధన, మీ సాంకేతికత క్లిష్ట పరిస్థితుల్లో వ్యవసాయాన్ని సులభతరం చేసింది, నిలకడగా మార్చింది” అంటూ ICRISAT గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే దిశగా పనులు జరుగాలన్నారు. ఇక ఇవాళ సాయంత్రం ముచ్చింతల్‌ గ్రామానికి వెళ్లనున్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news