కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే.- బండి సంజయ్

-

కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధమే అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ పార్టీని, బండి సంజయ్ కి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అబద్దాల కోసమే కేసీఆర్ మీటింగ్ లు పెడతారని, ఆయన ఇచ్చే హమీలు.. ఎన్నికల ప్రచారం కూడా అబద్దాలే అని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా.. బుద్ది రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ చేయలేదు. మొదటి రుణమాఫీ చేయడానికే నాలుగేళ్లు పట్టిందని దుయ్య బట్టారు. రైతులు కార్లలో ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేక యువత ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సోయి ఉండి మాట్లాడుతున్నాడా.. సోయి లేక మాట్లాడుతున్నాడా..అని వరి కోనుగోలు అంశంపై ప్రశ్నించారు. రైతులను ఆగం చేసిది నువ్వు అని కేసీఆర్ గురించి అన్నారు. సన్నవడ్లను వేయిమని ఓసారి, పత్తిని పండించమని ఓసారి చెబుతూ.. రైతుల ధాన్యం కొనకుండా రైతులను ఆగం చేసేది నువ్వే అని కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news