రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచి రైతు బంధు నిధులు జమ

-

తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఎండాకాలం ముగియడం… ఖరీఫ్ సాగు మొదలు ముంచుకొస్తున్న తరుణంలో రైతులకు రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. అటు రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. జూన్‌ మొదటి వారం నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం.

ఇందులో భాగంగానే జూన్‌ మొదటి వారం నుంచి.. అంటే ఎల్లుండి నుంచి ఈ నెల చివరి వరకు వానా కాలం సాగుకు రైతుబంధు డబ్బులను… రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్ లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు.. రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లో బదిలీ చేశారు. ఈ సీజన్ లోనూ అదే పద్ధతిని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news