గుజరాత్ లో ఏదో పొడిచేసినట్టు మోడీ వచ్చాడు..అదంతా దొంగ ప్రచారమే : కెసిఆర్

-

ప్రధాని మోడీ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో ఏదో పొడిచేసినట్టు మోడీ వచ్చాడు..అదంతా దొంగ ప్రచారమేనని ఫైర్ అయ్యారు కెసిఆర్. దొంగ ప్రచారాలతో గుజరాత్ మోడల్ అని వచ్చారని చురకలు అంటించారు. గ్రామీ ణ ఉపాధి హామీ పథకం కు 25000 కోట్లు తగ్గించారని.. కేంద్రానికి మెదడు లేదని చురకలు అంటించారు.

KCR and Modi

పనికిమాలిన పవర్ పాలసీ అమలు చేస్తోందన్నారు. రైతుల దగ్గర విద్యుత్ ఛార్జీలు వసూలు చేయమంటున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఏదో పొడిచేసినట్టు నరేంద్రమోడీ వచ్చారు.. దిక్కుమాలిన పాలసీ గుజరాత్ మోడల్ అని నిప్పులు చెరిగారు. కరోనా వచ్చి అల్లాడితే కేంద్రం ఏమి చేసిందని.. గంగానదిలో శవాలు తెలేలా చేసిందని మోడి సర్కార్ పై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news