“ధరణి పోర్టల్ ” తీసెయ్యాలి అన్న వారి మాట అస్సలు వినొద్దు: సీఎం కేసీఆర్

-

తెలంగాణాలో త్వరలో ఎన్నికలు రానుండడంతో మళ్ళీ అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ ను తీసెయ్యాలి అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడెయ్యాలి అన్నారు. ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్నారో వాళ్ళను రైతులే బంగాళాఖాతంలో కలిపేసి రోజు వస్తుందన్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ వలన ప్రజలకు కలుగుతుంది ప్రయోజనాలను వివరించారు. ఈ వివరాలను రైతులకు చెప్పిన కేసీఆర్ రైతులనే ప్రశ్నించారు.

ఇప్పుడు చెప్పండి ధరణి పోర్టల్ ఉండాలా వద్దా అంటూ … ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు చేతులు పైకి లేపాలని చెప్పారు కేసీఆర్. మీకు ప్రయోజనం చేకూరిస్తున ఈ ధరణి పోర్టల్ ను ఆపెయ్యాలి అన్నవారి మాటలను అస్సలు నమ్మొద్దని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news