నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుండగా.. ఈ భేటీలో దేవాదాయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మన్ల పదవి కాలం పూర్తయ్యే వరకు కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణకు ఆమోదం తెలపనున్నారు.