మునుగోడులో భారీ మెజారిటీతో బీజేపీ గెలువబోతోంది – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

మునుగోడులో భారీ మెజారిటీతో బీజేపీ గెలువబోతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికకు బిజెపి పూర్తిగా సిద్దంగా ఉందని.. మునుగోడు లో బిజెపి భారీ మెజారిటీ తో, మునుగోడు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల షెడ్యూల్ ను స్వాగతిస్తున్నాము..మోటర్ లకు మీటర్ ల ప్రచారం ని ప్రజలు నమ్మలేదని వెల్లడించారు తెలంగాణ లో నిజం, ధర్మం గెలుస్తుందని.. తెలంగాణ అమరవీరుల కెసిఆర్ కుటుంబం కోసం ఆత్మహత్య లు చేసుకోలేదని వెల్లడించారు.

ఫార్మ్ హౌస్ పాలన తెలంగాణ లో పోవడం ఖాయమని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశం లో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబమని.. కేంద్రం పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. కెసిఆర్ ప్రధాని అయినట్టు ఆయన కూతురు ముఖ్య శాఖ నిర్వహిస్తున్నట్టు కేటీఆర్ సీఎం అయినట్టు ఆ కుటుంబం పగటి కల కంటుంది..ఉత్తర కుమార మాటలు ప్రజులు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version