ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్

-

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా చెపాక్‌ మైదానంలో మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్న సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  నిజానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 10 పరుగుల తేడాతో గెలిచింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో టోర్నీ ఆరంభ మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్ కూడా ఓటమి పాలయింది.

 

అలా లీగ్‌లో బోణీ కొట్టాలని రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై పట్టుదలతో ఉండగా, వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందాలని కోల్‌కతా సేన భావిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్‌, ఎంఐ రెండూ సక్సెస్ఫుల్ జట్లు కావచ్చు. కానీ ఒకదానితో ఒకటి పోటీ విషయానికి వస్తే, ఈ రెండు జట్ల మధ్య చాలా ఏకపక్ష రికార్డులు ఉంటాయి. ఇరు జట్లు గత ఐపీఎల్ లో 12 సార్లు పోటీ పడ్డాయి. ముంబై 11 సార్లు గెలిచింది.  

Read more RELATED
Recommended to you

Latest news