ఐపీఎల్: MI vs KKR రస్సెల్ బౌలింగ్ మాయాజాలం.. నైట్ రడర్స్ లక్ష్యం 153

-

ఐపీఎల్ లో ఈ రోజు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు ఈ సీజన్లో తమ రెండవ మ్యాచుని ఆడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్, బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్ 10పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యాన్ని కుదిర్చాడు. 10వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఇషాన్ కిషన్ కూడా వెనుదిరిగాడు.

మొత్తానికి 20ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 152పరుగులు చేయగలిగింది. ముంబై బ్యాట్స్ మెన్లలో సూర్యకుమార్ యాదవ్ 56పరుగులు (36బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), రోహిత్ శర్మ 43పరుగులు ( 32పరుగులు 3ఫోర్లు, 1సిక్సర్) చేసారు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ ఐదు వికెట్లు తీసుకోగా, పాట్ కమ్మిన్స్ 2వికెట్లు, వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్, ప్రసీద క్రిష్ణ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version