అప్పుడు హరికృష్ణ, ఎన్టీఆర్‌ తరిమేశారు..కేబినేట్ నుంచి జగన్ తరిమేశారు- వంగలపూడి అనిత

-

హరికృష్ణ, జూ.ఎన్టీఆర్‌ లకు కొడాలి నాని వెన్నుపోటు పొడిచాడని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15న విశాఖ లో జరిగేది ప్రజా గర్జన కాదు.. భూ కబ్జా రాయుళ్ల సభ అని ఫైర్‌ అయ్యారు. విశాఖలో ఏర్పడింది జాయింట్ యాక్షన్ కమిటీ కాదు.. జగన్ యాక్షన్ కమిటీ అని.. విశాఖను దోచుకోవడానికే రాజధాని ప్రకటన చేశారని నిప్పులు చెరిగారు.

అమరావతి రైతుల కాళ్ళు విరగ్గొడితే.. మా దగ్గర కర్రలు ఉన్నాయి.. మీకు కాళ్ళు ఉన్నాయి అని మర్చిపోవద్దని హెచ్చరించారు. మీరు రైతులపై ఒక కర్ర ఎత్తితే.. మేము 100 కర్రలు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

కొడాలి నాని గతంలో హరికృష్ణను ముంచాడు.. అందుకే హరికృష్ణ తన్ని తరిమేశాడు.. జూనియర్ ఎన్టీఆరునూ కొడాలి నాని మోసం చేశాడు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ నానిని దూరంగా పెట్టాడన్నారు. ఇప్పుడు సీఎం జగనుకు నాని టోపి పెట్టాడు.. అందుకే నానిని క్యాబినెట్ నుండి జగన్ తరిమేశాడని వెల్లడించారు. పదో తరగతి ఫెయిలైన బ్యాచ్ అంత వైసీపీలో ఉన్నారు.విశాఖ భూ స్కామ్ లు బయటపడతాయని అమరావతి రైతుల యాత్రను అడ్డుకుంటామని వైసీపీ బెదిరిస్తున్నారని ఆగ్రహించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news