టిఆర్ఎస్ లోకి వెళ్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయిపోయేది – కోమటి రెడ్డి

-

నల్లగొండ : నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామంలో సీసీ రోడ్లకు ఎంపీ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు మరియు వాటర్ ప్లాంటులను ప్రారంభించారు టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టు పూర్తి చేస్తే వెంకట్ రెడ్డి కి పేరు వస్తోందని సీఎం కేసీఆర్ కక్ష కట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడం లేదని ఆగ్రహించారు. టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి ఐయ్యేది. మంత్రి పదవి కూడా వచ్చేది. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చెయ్యడం ఇష్టం లేదని మండిపడ్డారు.

ఇంత వర్షం వచ్చిన మా ప్రాజెక్ట్ చుక్క నీరు రాలే, కానీ లక్షనర కోట్ల రూపాయలను కాళేశ్వరం పేరుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని… సీఎం కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషివి ఐతే ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తి చేయాలని హెచ్చరించారు. నీళ్లులేని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి తప్ప ఉన్న ప్రాంతంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడుతున్నారు…ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాపిచ్చుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉంది కాబట్టే ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తాం అంటున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నారు. స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటిస్తా. కాంగ్రెస్ గవర్నమెంట్ వెచ్చే విధంగా కృషి చేస్తానని ప్రకటించారు. శ్రీశైలo సొరంగ మార్గం, బ్రాహ్మణ వేలంల ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు కాబట్టే, నల్లగొండ జిల్లాలో మొత్తం 12కు 12 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సర్వేలు కూడా అదే చెప్పుతున్నాయని స్పష్టం చేశారు కోమటి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news