గోవాలో ద్రౌపది ముర్మని కలిసిన RRR టీం

-

రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌ పది ముర్ము ని కలిశారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రస్తుతం గోవాలో ఉన్నారు రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌ పది ముర్ము. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు అయిన రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ముని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

కాగా.. ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ప్రధాని నరేంద్ర మోడీతో నిన్న మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతి గా అవకాశం కల్పించినందుకు ద్రౌపదీ ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల చివరల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతి పక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news