మోడీ సభ వేళ.. పార్టీ మారడంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

పార్టీ మారడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే ఉద్దేశం లేదు.. ఒకవేళ మారాల్సి వస్తే అందరిని ఒప్పించి… సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మునుగోడు లో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఈ సందర్భంగా మాట్లాడారు.

Komatireddy Rajagopal Reddy | Munugode constituency MLA

నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు..మంత్రికి ఇన్ని నియోజకవర్గాలు ఉండగా మునుగోడు లో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయడంలో ఉన్న అంతర్యమేమిటి..? అని నిలదీశారు. మంత్రి కి సూర్యాపేటలో గెలిచే దిక్కు లేదు గాని మునుగోడు లో తిరగడం ఏమిటి..? అని ప్రశ్నించారు.

దళితులు తక్కువగా ఉన్న గ్రామాలు ఎంచుకుని దొంగలలాగా ప్రొటో కాల్ లేకుండా పంపిణి చేస్తున్నారు..అని ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో మునుగోడు లో పోటీ చేయలా వద్దా అనేది అప్పటి పరిస్థితి ని బట్టి నిర్ణయం తీసుకుంటా..ఎమ్మెల్యే అయినా ఎంపీ గా వచ్చిన మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version