కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంకగాంధీ సూచించారు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు ఉప ఎన్నిక, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్ని పరిస్థితులపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే ఈ మీటింగ్‌కు స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు. అయితే తాజాగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీతో అర్థవంతమైన మీటింగ్ జరిగిందని అన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రం, దేశ రాజకీయాలు, రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై కూడా చర్చించామన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రధానంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందన్నారు.

ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. - Andhrajyothy

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంకగాంధీ సూచించారని తెలిపారు వెంకట్‌రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చర్చించామన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై తాను కొన్ని సలహాలు ఇచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు వెంకట్‌రెడ్డి. పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక గాంధీతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆమెకు వివరించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news