ఏపీ ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ సర్కార్‌ పై నెల్లూరు జిల్లా రూరల్ ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరను చేయాలనుకున్నామని.. మౌఖికంగా అనుమతి ఇచ్చిన తర్వాత జాతరను చేయకూడదని అధికారులు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.

కేవలం నాకు పేరు వస్తుందని ఉద్దేశంతోనే ఆధార ప్రభాకర్ రెడ్డి ఆనం విజయకుమార్ రెడ్డి లు దీన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. జాతర వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినా నేను సామాన్య భక్తుడిలా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని… మహా శివరాత్రి ఉత్సవాలతో పాటు కనుపూరు జాతర కూడా జరిగిందని వివరించారు. అప్పుడు లేని ఎన్నికల కోడ్ ఇప్పుడే వచ్చిందా అని నిలదీశారు. జాతరను మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పేరు వచ్చేలా ఘనంగా నిర్వహిస్తామని.. ఇప్పటికైనా మనసు మార్చుకుని జాతర నిర్వహించాలని కోరుతున్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version