తెలంగాణలో దోచుకున్న డబ్బుతో కేటీఆర్ లండన్ లో ఆస్తులు కొంటున్నారు: టిపిసిసి

-

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి నేతృత్వం వహించిన ఆయన.. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ఎంతో అనుకూలమోనన్న విషయాన్ని పలు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా కేటీఆర్ సాగిస్తున్న ఈ టూర్ పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ(టిపిసిసి) సంచలన ఆరోపణలు చేసింది.

మూడు రోజులుగా లండన్ లో తిరుగుతున్న కేటీఆర్.. రాష్ట్రంలో దోచుకున్న డబ్బు తో అక్కడ వందల కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు అంటూ టిపిసిసి ట్విట్టర్ వేదికగా కీలక ఆరోపణ చేసింది. లండన్ టూర్ కు కేటీఆర్ సపరివార సమేతంగా వెళ్లారు అని కూడా ఆపార్టీ ఆరోపించింది. అదే సమయంలో సొంత డబ్బులు ఖర్చు చేసే కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పనులు చేసిన సర్పంచ్ లకు బిల్లులు రాకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news