BREAKING : మంత్రి కేటీఆర్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత

-

మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రల శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వానం అందింది. ప్రపంచ పర్యావరణ, జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కే.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE—EWRI) ఆహ్వానించింది. అమెరికా హెండర్సన్ లో మే 21 -25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరుగుతాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం (2017 మే 22న) అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అప్పుడు ముఖ్యోపన్యాసం చేసిన కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ భారీ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్దేశించిన సాహసోపేతమైన, ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఆ సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE—EWRI) మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్ తో పాటు అధ్యక్షుడిగా ఎన్నికైన షిర్లీ క్లార్క్ నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం ఈ మ‌ధ్య‌ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పరిధి, సామర్థ్యంతో పాటు నిర్మాణంలో చూపించిన అద్భుతమైన వేగానికి ఆ బృందం ఆశ్చర్యపోయింది. ఇంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కలిగిన సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రశంసించింది. మంత్రి కేటీఆర్‌ను కలిసిన బృందం, ఒక బృహత్ సంకల్పాన్ని అతి తక్కువ సమయంలోనే వాస్తవంగా మార్చినందుకు అభినందనలు తెలియచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news