కేటీఆర్ ట్విట్టర్ లో.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో: తరుణ్ చుగ్

-

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో బీజేపీ ఆందోళన మొదలుపెట్టిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరని.. శాంతిభద్రతలు గాలిలో కలిసాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార కేసులో నిందితులను తప్పించేందుకు రాష్ట్ర సర్కారు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

నిందితులకు పోలీసులే కొమ్ముకాస్తున్నారని, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నేరాలు పెరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో.. కేటీఆర్ ట్విట్టర్ లో.. అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందని, కెసిఆర్ పూర్తిగా కుటుంబ రాజకీయాల్లో మునిగి పోయారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news