బండి సంజయ్ కి సవాల్ విసిరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం మూసాపేటలో చెరువుల కబ్జా చేస్తున్నారంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులపై బండి సంజయ్ ఆరోపణలుు చేశారు. ఈ ఆరోపణలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందిస్తూ.. చెరువుల కబ్జాపై బీజేపీ ఎమ్మెల్యే మీడియాతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తే కబ్జాలపై విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

తాను చెరువుల కబ్జాకు పాల్పడలేదని.. ఒకవేళ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే, లేదా కబ్జాలలో బిజెపి నాయకులకు హస్తం ఉంటే బండి సంజయ్ రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news