టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న మరో కలెక్టర్…?

-

టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మరో కలెక్టర్ సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మరో ఐఏఎస్ అధికారి టీఆర్ఎస్ తీర్థ పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఎల్ శర్మన్ మరో రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆ తరువాత ఆయన గులాబీ గూటికి చేరుకోనున్నారని తెలుస్తోంది. శర్మన్ గ్రూప్ 1 అధికారిగా చేరి అంచలంచెలుగా కలెక్టర్ స్థాయికి వచ్చారు. జీహెచ్ ఎంసీ అదనపు కార్యదర్శిగా, మహబూబ్ నగర్ జేసీగా, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా పనిచేశారు. రిజర్వుడ్ స్థానాలైన ఆదిలాబాద్ లేదా ఖానాపూర్ అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయన్న ఎమ్మెల్సీ అవకాశం వరించింది. ప్రస్తుతం ఇదే బాటలో ఎల్. శర్మన్ కూడా నడుస్తారని తెలుస్తోంది. పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version