భూమి వివాదాలే కారణం : మాదాపూర్ కాల్పులపై పోలీసులు

-

హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవ కారణంగా కాల్పులు జరిగాయి. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాధాపూర్‌ ఠాణా సమీపంలోని నీరూస్‌ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది.


ఈ ఘటనకు భూ వివాదాలే ప్రధాన కారణమని మాదాపూర్ ఇంఛార్జ్ డీసీపీ సందీప్ రావు తెలిపారు.
‘పాతబస్తీకి చెందిన రౌడీషీటర్లు ఇస్మాయిల్‌, ముజాహిద్‌ అలియాస్‌ ముజ్జుకు గతంలో జైలులో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇద్దరు రౌడీషీటర్లు కలిసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో 250 గజాల స్థలంకు సంబంధించి వీరి మధ్య వివాదం ఏర్పడింది. గతంలో పలుమార్లు ఇరువురు స్థల వివాదానికి సంబంధించి సమావేశమై చర్చించుకున్నారు. అయితే మరోసారి మాట్లాడుకుందామని ఇద్దరు తమ అనుచరులతో కలిసి వేర్వేరుగా మాదాపూర్‌ నీరూస్‌ వద్దకు చేరుకున్నారు.’ అని డీసీపీ సందీప్ రావు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ముజాహిద్‌, ముజాహిద్ రైట్ హ్యాండ్ జిలానీ కలసి ఇస్మాయిల్‌ పై రెండు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం జిలానీ ఒక్కడే ఒక నాటు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఎన్ని రౌండ్లు కాల్పులు జరిగాయి… ఎన్ని తుపాకులు ఇందుకోసం వాడారు అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాల్పుల సమయంలో ఇస్మాయిల్‌ అనుచరుడు జహంగీర్‌ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతను గాయాలపాలయ్యాడు. ఇస్మాయిల్‌ కుప్పకూలడంతో ముజాహిద్‌ అతని అనుచరులు అక్కడ నుంచి పరారయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news