కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రికి హ‌రీష్‌రావు లేఖ‌

-

కేంద్ర వైద్య ఆరోగ్య‌ శాఖ మంత్రికి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులలు హ‌రీష్‌ రావు లేఖ‌ రాశారు. 60 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్రికాష‌న‌రి డోసు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశ్యంతో మంత్రి హరీష్‌ రావు ఈ లేఖ రాశారు. రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని లేఖలో డిమాండ్‌ చేశారు.

హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని తెలిపారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నామని లేఖలో పేర్కొన్న మంత్రి హరీష్ రావు… పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Latest news