“లైగర్” సినిమా దేశంలోనే నెంబర్ 1 అవుతుంది – మంత్రి ఎర్రబెల్లి

-

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ ఛార్మీ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచింది చిత్ర బృందం.

తాజాగా ఆదివారం వరంగల్ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ లో ఆదివారం “లైగర్” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్, చార్మి, ప్రముఖ నటుడు ఆలీతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ , ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ లైగర్ సినిమా దేశంలోనే నెంబర్ వన్ అవుతుందని అన్నారు.

వరంగల్ లో స్టూడియో పెట్టాలని పూరి జగన్నాథ్, చార్మిలను కోరుతున్నానని.. కెసిఆర్, కేటీఆర్ లతో మాట్లాడి భూమి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. సినిమాకు వరంగల్ చిరునామా కావాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news