తాడేపల్లి గంజాయికి అడ్డాగా మారింది – నారా లోకేష్

-

సీఎం జగన్‌ పై నారా లోకేష్‌ మరోసారి ఫైర్‌ అయ్యారు. సిఎం నివాసం ఉంటున్న తాడేపల్లి గంజాయికి అడ్డాగా మారిందని ఆరోపణలు చేశారు. గంజాయి మత్తులో సిఎం ఇంటి పరిసరాల్లో మృగాళ్లు అత్యాచారాలకి పాల్పడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే విధ్వంసం సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు.

పేదల ఇళ్లు కూల్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎమ్మెల్యే ఆర్కే పాల్పడుతున్న అవినీతి, అరాచకాలపై నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదంటే..అంగీకరిస్తున్నట్టేనని నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదా కోసం ప్రధాని మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన #PalacePilli ప్రధాని ఎదుట మియావ్ మియావ్ అంటూ గొణిగింది. సార్, సార్, సార్ అంటూ కాళ్లావేళ్లా పడటం తప్పించి..ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రధాని మోదీని ఒక్క మాటా అడగలేదని ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news