భారీ ప్లానింగ్‌తో పాదయాత్ర..లోకేష్‌కు సపోర్ట్!

-

జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే. కుప్పం నుంచి ఈ పాదయాత్ర మొదలవుతుంది..400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర ఉంటుంది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లని టీడీపీ శ్రేణులు పూర్తి చేసే పనిలో ఉన్నాయి. ఇక పాదయాత్ర ముందు రోజే లోకేష్ తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని, అటు నుంచి కుప్పంకు వెళ్లనున్నారు. 27వ తేదీన 12 గంటలకు లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది.

అయితే ఈ పాదయాత్ర ప్రారంభం భారీ స్థాయిలో సక్సెస్ అయ్యేలా టీడీపీ ప్లాన్ చేస్తుంది. ఈ పాదయాత్రకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరు అవుతారని తెలుస్తోంది. అలాగే 175 నియోజకవర్గాల ఇన్‍చార్జ్‌లు, అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు సైతం పాదయాత్ర ప్రారంభం రోజు వస్తారని తెలుస్తోంది.

ఇక నెల రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే  ఒక్కో నియోజకవర్గంలో రెండు నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర ఉండేలా రూపకల్పన చేస్తున్నారు.

ఇక ఎప్పటికప్పుడు లోకేష్ పాదయాత్ర పర్యవేక్షణ కోసం ప్రత్యేక టీమ్‍లు పనిచేయనున్నాయి. అంటే పాదయాత్ర మొదట రోజు భారీ స్థాయిలో సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. అయితే పాదయాత్ర ద్వారా టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు. అందులో యువత ఓటర్లని ఆకర్షించడమే ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే పాదయాత్ర చేసిన వారు ఇప్పటివరకు సక్సెస్ అవుతూ వచ్చారు. మరి లోకేష్ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news