రెచ్చిపోయిన సాక్షి రిపోర్టర్..వీడియో షేర్‌ చేసిన లోకేష్‌

-

సాక్షి రిపోర్టర్‌ చేసిన దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ… టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సంచలన ట్వీట్‌ చేశారు. యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు ఉంటారంటూ ఎద్దేవా చేస్తూ… సాక్షి రిపోర్టర్‌ చేసిన దౌర్జన్యాన్ని ఓ వీడియో ద్వారా బయట పెట్టాడు లోకేష్‌.

వైసిపి నాయకులు, భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు సాక్షి సిబ్బంది… మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ నాగి రెడ్డి దాష్టీకం చూస్తుంటే..ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని అర్థమవుతుందని ఫైర్‌ అయ్యారు.

ప్రైవేట్ భూ వివాదంలో జోక్యం చేసుకోవడమే తప్పు అయితే, ఆ స్థల యజమాని అయిన వృద్ధుడు కాళ్ళు పట్టుకొని చంపొద్దని ప్రాధేయపడినా వదలకుండా దాడికి పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్‌. అడ్డొచ్చిన మహిళను కాలితో తన్నిన సాక్షి విలేకరి నాగిరెడ్డి అరాచకాలకి అడ్డే లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news