Madhavan : మరో బయోపిక్​లో మాధవన్.. ఈసారి మిరాకిల్ మ్యాన్ జీవిత కథతో..

-

హ్యాండ్సమ్ హీరో ఆర్ మాధవన్ ఇటీవలే రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌ అనే బయోపిక్​లో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మాధవన్ తాజాగా మరో బయోపిక్​లో నటిస్తున్నారు. ఇంతకీ ఎవరి జీవిత కథతో మాధవన్ మన ముందుకు రాబోతున్నారో తెలుసా..?

‘ది ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన జి. డి. నాయుడు బయోపిక్‌లో ఆయన టైటిల్‌ పాత్ర పోషించనున్నారు. ట్విటర్‌ వేదికగా మాధవన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ‘రాకెట్రీ’లో నటించడమే కాకుండా తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఆ బయోపిక్‌లో అద్భుత నటన కనబరిచిన ఆయన.. ఇప్పుడు మరో బయోపిక్‌తో వస్తున్నానని పోస్ట్‌ పెట్టడంతో సినీ అభిమానుల్లో అప్పుడే అంచనాలు నెలకొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news