మధ్యప్రదేశ్ లో నిర్భయ తరహా ఘటన… బస్సులో మహిళపై అత్యాచారం

-

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా… దేశంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో ఓ చోట మహిళలు అఘాయిత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కుక్షి నుంచి మనవర్ కు బస్సు వెళ్తుండగా.. అందులో మహిళ ఎక్కింది. బాధితురాలు లాంగ్సారిలో దిగాలి అయితే.. బస్సు డ్రైవర్ ముందస్తు అనుకున్న ప్రకారం లాంగ్సారిలో బస్సును ఆపలేదు. దీంతో ప్రయాణికులు నిలదీశారు. అయితే తరువాత వచ్చే స్టేజీలో మహిళనను దింపేస్తామని డ్రైవర్, కండక్టర్ నమ్మబలికారు. సమీపంలోని గంధవాణి ప్రాంతంలో దింపుతామని చెప్పారు. అయితే ఆస్టేజీ వచ్చే వరకు బస్సులో ప్రయాణికులు అంతా ఖాళీ అయ్యారు. దీంతో ఓ నిర్జన ప్రాంతంలో బస్సును ఆపి మహిళపై డ్రైవర్, కండక్టర్, మరోవ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో మహిళ అరుపులు విన్నవారు మహిళను రక్షించారు. నిందుతులను పట్టుకుని మహిళను రక్షించారు. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకరు పరారవ్వగా.. ఇద్దరిని పోలీసుల అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news