మద్రాస్ హైకోర్టు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోన్స్ వాడకూడదు

-

ఇటీవల కాలంలో మద్రాస్ హైకోర్టు పలు సంచలన తీర్పులు ఇస్తూ వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా  ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోన్లు వాడకూడదు అని తీర్పు ఇచ్చింది.

 

మద్రాస్ హైకోర్టులో జస్టిస్ సుబ్రమణ్యం నేతృత్వంలోని మధురై బెంచ్ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది పని వేళల్లో తమ వ్యక్తిగత ఫోన్లు వాడకూడదని తీర్పు చెప్పింది.

 

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోకి కొన్ని ప్రాంతాల్లో పని వేళల్లో ప్రభుత్వ సిబ్బంది విరివిగా తమ వ్యక్తిగత ఫోన్లు ఉపయోగిస్తూ చేసే పనిలో అలసత్వం వహిస్తున్నారు అని తమ దృష్టికి వచ్చిందని ధర్మాసనం  పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version