Mahesh Babu: మహేశ్ బాబు లైనప్ మూవీస్ మామూలుగా లేవు..ఫ్యాన్స్‌కు ఇక సెలబ్రేషన్సే!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో చివరగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన పిక్చర్ రిలీజ్ కాలేదు. వచ్చే నెల 12న మహేశ్ ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కానుంది. ఈ మూవీపైన భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే, ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని, అభిమానుల అంచనాలను మించి ఉంటుందని దర్శకులు పరశురామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘సర్కారు వారి పాట’తో మొదలైన సంబురాలు..ఇక కొనసాగు..తూనే ఉంటాయని మహేశ్-కృష్ణ అభిమానులు అంటున్నారు. అందుకు గల కారణాలూ చెప్తున్నారు. మహేశ్ నెక్స్ట్ ఫిల్మ్స్ లైనప్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వన్స్ ‘సర్కారు వారి పాట’ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మహేశ్..తన స్నేహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘SSMB28’ ఫిల్మ్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

‘అతడు, ఖలేజా’ సినిమాల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ ఫిల్మ్ డెఫినెట్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నదని టాక్. కాగా, ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయ్యే లోపు లేదా ప్యారలల్ గానైనా మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేశ్.

అలా బ్యాక్ బు బ్యాక్ మూవీస్ సూపర్ హిట్ అవుతాయని ఈ సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో తన విజయాలను ఇక నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాడని ఈ సందర్భంగా అభిమానులు జోస్యం చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news