పూరీ జగన్నాథ్ ‘జనగణమన’కు ఎట్టకేలకు మోక్షం.. చాన్స్ మిస్ చేసుకున్న మహేశ్ బాబు..

-

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ ఫిల్మ్ ‘బద్రి’ నుంచి ఇటీవల కంప్లీట్ అయిన ‘లైగర్’ వరకు చాలా త్వరగా సినిమాలు చేసేస్తుంటారు. ఇక డైలాగ్స్ విషయంలో పూరీ జగన్నాథ్ టైమింగ్ చాలా బాగుంటుందని సినీ అభిమానులు చెప్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ సైతం చాలా సార్లు పూరీ జగన్నాథ్ డైలాగ్స్ బాగుంటాయని చెప్పారు. ఆయనే తన శత్రువని అంటుంటారు కూడా. అటువంటి పూరీ జగన్నాథ్ చాలా కాలం నుంచి తీస్తానంటున్న ‘జనగణమన’ చిత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ మంగళవారం వచ్చేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తన తొలి చిత్రం ‘బద్రి’ తీసిన పూరీ జగన్నాథ్ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ ఎప్పుడు తీస్తారా? అనే చర్చ చాలా కాలం నుంచి సాగుతున్నది. మహేశ్ బాబుతో ‘పోకిరి, బిజినెస్ మ్యాన్’ చిత్రాలు తీసిన పూరీ జగన్నాథ్ ఆ తర్వాత మహేశ్ బాబుతోనే ‘జనగణమన’ తీస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి కూడా. కానీ, మహేశ్ అప్పట్లో మహేశ్ తనకు ఫ్లాప్స్ ఉన్నాయని అవకాశమిచ్చేందుకు వెనుకాడరని, అందుకే తాను మహేశ్ బాబు వద్దకు వెళ్లలేదని పూరీ జగన్నాథ్ పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.

అలా ‘జనగణమన’ ప్రాజెక్టు అటకెక్కేసింది. మహేశ్ బాబు కాకుండా పవన్ కల్యాణ్, చిరంజీవిలతోనూ పూరీ జగన్నాథ్ ‘జనగణమన’ స్క్రిప్ట్ చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ చర్చించుకున్నాయి. కానీ, చివరకు అది రౌడీ హీరో విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లింది. ‘లైగర్’ మూవీతో కుదిరిన వీరి బంధం మరింత బలపడింది. అలా సేమ్ కాంబోలో ‘జేజీఎం’ పేరిట తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ విజయ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

ఇక ఈ చిత్ర విడుదల తేదీని కూడా ఇప్పుడే అధికారికంగా ప్రకటించేశారు పూరీ జగన్నాథ్. వచ్చే ఏడాది ఆగస్టు 3న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు. అలా తన డ్రీమ్ ప్రాజెక్టును పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ లోనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయం, భారతీయుల కర్తవ్యాలు, వ్యవస్థ, భారత ఆర్మీ ఇతర అంశాలపైన స్టోరి ఉండబోతుందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. పోస్టర్ లో కొందరు సైనికులు అలా గాలిలో ఉండగా, వందల మంది సోల్జర్స్ భూమ్మీద ఉండటం స్పష్టమవుతోంది. భారత ఆర్మీ సోల్జర్ గా విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కనిపించబోతుండగా, ఈ చిత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news