ఎన్టీఆర్ శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుంది-మంత్రి కొడాలి నాని

-

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ దరిద్రంలా పట్టారని.. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు మంత్రి కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. పార్టీ అధికారంలోకి రావడానికి మరోసారి ఎన్టీఆర్ కి, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి బయటకు గెంటెసి, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందికి దించారని.. మళ్లీ వెన్నుపోటు పొడవాలని 420 బ్యాచ్ చూస్తుందని ఆరోపించారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు కొడాలి నాని. ఎన్టీఆర్ శాపం చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందని కొడాలి నాని అన్నారు. ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాక్రిష్ణ, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఎన్టీఆర్ విగ్రహం కాలు పట్టుకొని క్షమించాలని వేడుకోవాలని అన్నారు. మీరే ఎన్టీఆర్ పదవి లాక్కుంటారు, మీరే మళ్లీ ఫోటోలు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని… స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లను కూడా టీడీపీ గెలవలేదని గుర్తు చేశారు. నారాలోకేష్ మంగళగిరిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారని.. ఇది ఎన్టీఆర్ శాపమే అని కొడాలి నాని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలా వచ్చి దాక్కున్నావని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news