Mahesh Babu : పెళ్లి రోజున నమ్రతకు మహేశ్ బాబు స్వీట్ విషెస్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ కపుల్ ఉంటే ముందుగా వీళ్లే గుర్తొస్తారు. ఇవాళ వీళ్లిద్దరు తమ 18వ వివాహక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇరువురు సోషల్ మీడియాలో ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు.

తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌కు మ్యారేజ్ డే విషెస్ చెప్పారు మహేశ్ బాబు. జీవితాంతం ఇలాగే కలిసి ఉందామని కోరుకున్నారు. ఈమేరకు ఓ ఫొటోని షేర్‌ చేసిన ఆయన.. ‘‘మనం.. ఒకింత క్రేజీ, మరెంతో ప్రేమ..! మనం ఒక్కటై 18 ఏళ్లు అవుతోంది. మరెన్నో ఏళ్లపాటు మనం ఇలాగే కలిసి జీవించాలి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నమ్రతా శిరోద్కర్‌’’ అని రాసుకొచ్చారు.

దీనిపై నమ్రత స్పందిస్తూ.. ‘‘ఐ లవ్‌ యూ’’ అంటూ తన ప్రేమను తెలియజేశారు. అంతేకాకుండా 18 ఏళ్ల క్రితం తాము తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదేనని రాసుకొచ్చారు. పెళ్లి రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ జంట.. గురువారం సాయంత్రం స్విట్జర్లాండ్‌కు బయలుదేరింది.

Read more RELATED
Recommended to you

Latest news