షాకింగ్ : కేజీఎఫ్2 సినిమా చూస్తూ.. వ్యక్తి మృతి..

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ.. భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే.. సోమవారం కేజీఎఫ్‌-2 సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ సాగుతుండగా.. ఏపీలో ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు న‌గ‌రంలో కేజీఎఫ్2 సినిమా చూస్తూ.. థియేట‌ర్‌లోనే ఓ వ్య‌క్తి ప్రాణాలు వదిలాడు. దీంతో ఒక్కసారిగా.. సినిమా థియేటర్ లో గందరగోళం నెలకొంది.

KGF 2 opening bigger than RRR - TeluguBulletin.com

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృత‌దేహాన్ని శ‌వ ప‌రీక్ష కోసం ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సినిమా చూస్తుండ‌గా… ఆ వ్య‌క్తి ఏ కార‌ణంతో చ‌నిపోయాడన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news