చిత్తూరు జిల్లా జవాన్ సాయి తేజ కుటుంబానికి మంచు విష్ణు సాయం

-

చిత్తూరు జిల్లా జవాన్ సాయితేజ కుటుంబానికి అండగా నిలిచారు మంచు విష్ణు. భవిష్యత్ లో సాయితేజ కుటుంబానికి తాము అండగా ఉంటామని మంచు విష్ణు ప్రకటన చేశారు. సాయితేజ కొడుకు కుమార్తెల చదువు ఖర్చులు మొత్తం తన విద్యానికేతన్ బరిస్తుందని ప్రకటన చేశారు మంచు విష్ణు. పిల్లలు ఇంజనీరింగ్ వరకు మా సంస్థ లోనే ఉచితంగా చదివిస్తామని పేర్కొన్నారు మంచు విష్ణు.

అంతే కాదు త్వరలో సాయితేజ కుటుంబాన్ని కలనున్నారు మంచు విష్ణు. ఇవాళ సాయి తేజ కుటుంబాన్ని కలిసి.. వారి బాగోగులు తెలుసుకున్నారు విద్యానికేతన్ సంస్థ ప్రతినిధులు.  కాగా నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమిళనాడు రాష్ట్రంలోని కునురు ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సి డి యస్ జనరల్…. బీపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది మరణించారు. అయితే ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన జవాను సాయి తేజ కూడా ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news