BREAKING : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు.. మనీష్‌ సిసోడియా అరెస్ట్‌

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని.. నిబంధలకు విరుద్దంగా టెండర్ల అప్పగించారని ఆయనపై ముందు నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, అవినీతికి సంబంధించి సీబీఐ ఆదివారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఎనిమిది గంటల పాటు విచారణ అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతను అరెస్టు చేశారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరనుంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి.

 

ఆప్ సర్కారు తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ను జూలై 31, 2022న రద్దు చేయబడినప్పటి నుండి చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు, వారి సన్నిహితులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. కొత్త విధానాన్ని రద్దు చేసిన తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 17, 2020కి ముందు అమల్లో ఉన్న ‘పాత ఎక్సైజ్ విధానాన్ని’ తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. ఆప్ చర్యను అనుసరించి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్సైజ్ పాలసీ అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. సీబీఐ నిందితుడిగా పేర్కొనని డిప్యూటీ సీఎం ఇంటితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుచోట్ల సోదాలు నిర్వహించాయి. ఆరోపించిన కుంభకోణంపై ఆప్, బీజేపీల మధ్య వాగ్వాదాలు కూడా నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news