“మాటరాని మౌనమిది” ట్రైలర్ రిలీజ్

-

రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా”మాటరాని మౌనమిది”. ఈ చిత్రంలో మహేష్ దత్త, సోనీ శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ, త్రిల్లెర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 19వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ని విడుదల చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్ ఫేస్ మాస్కులతో ఉన్న వ్యక్తులు ఈ ట్రైలర్ ని ఆవిష్కరించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా కొత్తగా ఉంటుందని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version