నేడు ఘనంగా అల్లు స్టూడియో లాంఛ్.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

-

దివంగత అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించడానికి అల్లు ఫ్యామిలీ సర్వం సిద్ధం చేసింది. అల్లు రామలింగయ్య గుర్తుగా ఆయన కుటుంబం ఓ స్టూడియోను నిర్మించింది. గతేడాది హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్ లో అల్లు స్టూడియోస్ ను మొదలుపెట్టారు.

స్టూడియోస్ నిర్మాణం పూర్తి కావడంతో ఇవాళ అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ విషయాన్ని అల్లు స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.

గండిపేట్‌లో 10 ఎకరాల్లో ఈ స్టూడియోను నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో, అన్ని సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో ముందుగా ‘పుష్ప2’ షూటింగ్ ను జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరి ఈసారి మారేడుమిల్లి వెళ్తారో లేక వేరే లొకేషన్స్ ఏమైనా చూస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news