రాజకీయాల్లో ఎంట్రీపై నాగార్జున క్లారిటీ

-

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ది ఘోస్ట్. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 5నప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

ట్రైలర్ రిలీజ్ వేడుకలో నాగార్జున ఓ ఆసక్తికర విషయం మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నాననే వార్తలపై కింగ్ స్పందించారు. అంతేకాకుండా క్లారిటీ ఇచ్చి ఆ పుకార్లకు చెక్ పెట్టారు. తాను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు నాగార్జున. ఆయన త్వరలో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఇలా చెక్ పెట్టారు.

‘‘గత పదేళ్లుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని ప్రచారం జరుగుతోంది. అదెప్పుడూ నిజం కాలేదు. ఇప్పుడీ ప్రచారంలోనూ నిజం లేదు. నేను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయట్లేదు. మంచి కథ దొరికితే మాత్రం రాజకీయ నాయకుడిగా నటిస్తా’’ అన్నారు నాగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news