నేడు ఏపీలో మెగాస్టార్‌ చిరంజీవి పర్యటన..

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యవహారంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ మరియు ప్రతిపక్ష జనసేన పార్టీ ల మధ్య… తలెత్తిన వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఆన్లైన్ టికెట్ విధానాన్ని పవన్ వ్యతిరేకించడంతో ఈ వివాదం మొదలవగా… పవన్ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు చిత్ర పరిశ్రమ పెద్దలు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది.

ఇలాంటి తరుణంలో నేడు ఏపీలో పర్యటించనున్నారు మెగాస్టార్ చిరంజీవి. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. రాజమండ్రి లో ని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సహకారంతో ఏర్పాటు చేశారు. అయితే ఈ అల్లు రామ లింగయ్య కాంస్య విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు మెగాస్టార్ చిరంజీవి.

అలాగే 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించనున్నారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి పర్యటన నేపథ్యంలో… అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లనున్నారు. రేపు జరిగే శ్రమదానం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఒకేరోజు ఇద్దరు అన్నదమ్ములు ఏపీ పర్యటన చేస్తుండటంతో… అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news