పవన్ తో దిగిన ఫోటో వైరల్.. వివాదంలో మంత్రి అమర్నాథ్ !

-

విశాఖ : మంత్రి అమర్నాథ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తో దిగిన మంత్రి అమర్నాథ్ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అయింది. అయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంపై స్పందించారు మంత్రి అమర్నాథ్. మిగిలిన వాళ్ళ లాగా పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని నేను అననని వెల్లడించారు.

సిఎం జగన్ మోహన్ రెడ్డి నాకు ఇచ్చిన ఇమేజ్ కారణంగా నాతో చాలా మంది ఫోటోలు దిగుతారని….పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా చేసి ఉండవోచ్చని వెల్లడించారు. గతంలో ఎయిర్ పోర్టులో తీసుకున్న ఫోటోను వైరల్ చేస్తున్నారని సెటైర్ వేశారు.ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్‌కు గుర్తు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడాటం విచిత్రంగా ఉందని, కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంత వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news