బాలకృష్ణపై మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

-

బాలకృష్ణపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని.. ఈరోజు, రేపటి లోగా అన్నీ సమస్యలు పరిష్కరామవుతాయన్నారు. రెండు రోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుంది..టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు అప్పజెప్పి వెళ్లారని చెప్పారు. అన్నీ సమస్యలు పరిష్కరించాం, రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తామని వెల్లడించారు.

పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ అంత రాగ్దాంతం చేయాల్సిన అవసరం లేదు..ఆయన తండ్రి ఎన్టీఆర్ పేరిట కూడా ఓ జిల్లాను ప్రకటించాం.. టీడీపీ హయాంలో అతి కూడా చేసుకోలేక పోయారని నిప్పులు చెరిగారు.

ప్రభుత్వాలు మారినప్పుడు పధకాల పేర్లు మారటం సహజమని.. ఇవాళ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటున్న చంద్రబాబు ఏ రోజైనా కేంద్రానికి ఓ లేఖ రాశారా.. అని నిలదీశారు. మానసిక పరిస్దితి సరిగా లేని సుబ్బారావు గుప్తా విషయంలో స్పందించాలంటే సిగ్గుగా ఉందని.. సుబ్బారావు గుప్తా వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ తెలుసని చెప్పారు. తుని ఘటనలో అక్రమంగా ఆరోజున నమోదు చేసిన కేసులు ఎత్తివేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు..

Read more RELATED
Recommended to you

Latest news