ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు : మంత్రి బొత్స

-

డిసెంబరు 7న విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ‘జయహో బీసీ మహా సభ’ బహిరంగ సభకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఈ సభకు 84 వేల మంది హాజ‌ర‌వుతార‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. డిసెంబరు 7న విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ‘జయహో బీసీ మహా సభ’ బహిరంగ సభకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఈ సభకు 84 వేల మంది హాజ‌ర‌వుతార‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బీసీ గర్జనతో పాటు ఎస్సీ, ఎస్టీ గర్జనలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. చంద్రబాబు పర్యటనలనుద్దేశించి ఆయన ఘాటు విమర్శలు చేశారు.

కుల వృత్తులు నమ్ముకున్న వారు అదే కులంలో ఉండాలన్నది టీడీపీ విధానమని,అయితే అన్ని కులాల వారు చదువుతో అభ్యున్నతి సాధించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా.. జనం ఆయన్ను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఇదేం ఖర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ రాజకీయాల్లోకి రావద్దని ప్రజలు భావిస్తున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. బీసీల కోసం రూ. 80 వేల కోట్లు కేటాయించామని చెబుతూనే.. తూర్పు కాపులను బీసీ ఏలో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని మంత్రి బొత్స వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version