BREAKING : మంత్రి గౌతంరెడ్డి శాఖలు అప్పల రాజుకు అప్పగింత !

-

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. బాధ్యతలను బదలాయిస్తూ.. జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసెంబ్లీ బాధ్యతలను.. మంత్రి అప్పల రాజుకు అప్పగిస్తూ.. కీలక నిర్నయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

మార్చి 7 వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసెంబ్లీ బాధ్యతలను.. మంత్రి అప్పల రాజుకు అప్పగిస్తూ.. కీలక నిర్నయం తీసుకుంది ప్రభుత్వం.

కాగా.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. ఫిబ్ర వరి 21 వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. అయితే.. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలోమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్య క్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news