గజ్వేల్ లో కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి హరీష్ రావు

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సేవలు బాగున్నాయని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు.

70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. 12 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా.. ఎనిమిది లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ అవసరం అని గుర్తించడం జరిగిందన్నారు. కంటి వెలుగు ద్వారా 20 లక్షల మందికి కంటి సమస్యలు తొలగిపోయాయని వివరించారు. బాగా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version