నల్గొండ నుంచి ఫ్లోరోసిస్ ను కేసీఆర్ తరిమి వేశారు : మంత్రి జగదీష్‌రెడ్డి

-

మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గముకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ పార్టీలో చేరికైన వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి జగదీష్‌రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ నుంచి ఫ్లోరోసిస్ ను కేసీఆర్ తరిమి వేశారన్నారు. 2018 తర్వాత మునుగోడు లో అభివృద్ధి కుంటుపడిందని, ఆ ఎమ్మెల్యే ఆరు నెలలకు కూడా ఒక్కసారి మునుగోడుకు వచ్చింది లేదంటూ విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టులు, వ్యాపారాల్లో బిజీగా ఉండడడం వల్ల ఆ ఎమ్మెల్యేకు కల్యాణ లక్ష్మీ చెక్కులు ఇచ్చే తీరిక లేదంటూ మండిపడ్డారు జగదీష్ రెడ్డి.

Coal crisis: Minister blames Centre

అందుకే నేనే మునుగోడు కు రావాల్సి వచ్చింది …కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. నోరు ఇంత పెద్దగా చేసుకుని…నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్‌ రెడ్డి. మునుగోడులో మన అంతర్గత పొరపాట్ల వల్ల ఆ నియోజకవర్గ మును పోగొట్టుకున్నామని ఆయన అన్నారు. ఉన్న పార్టీ నాయకులనే దూషించి …అవతలి పార్టీని పొగిడే ఆ ఎమ్మెల్యే దగ్గర పనిచేయాలని టీఆర్ఎస్‌లోకి వస్తున్నారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news