బ్రేకింగ్ : రేపటి నుంచి తెలంగాణలో చీరాల పంపిణీ

-

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో మ‌హిళ‌లకు తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ అవుతుందన్నారు మంత్రి కేటీఆర్. చీరల పంపీణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్ టైల్స్ శాఖ తయారు చేసిందన్నారు మంత్రి కేటీఆర్.

KTR coins 'Bakwaas Jhumla Party' (BJP) on Twitter

గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు అభిప్రాయాలు, ఆసక్తులు, నిఫ్ట్ డిజైనర్లల సహకారంతో సరైన డిజైన్ లు మరియు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరల నూతన డిజైనులను ఉత్పత్తి చేశామన్నారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో తయారు చేయబడిన 100% పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందన్నారు. ఇందుకోసం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news