రాజగోపాల్‌ రెడ్డిని బ్లాక్‌ చేసిన కేటీఆర్‌.. కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌

-

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బహిరంగ ప్రసంగాల్లోనే కాకుండా.. సోషల్‌ మీడియా వేదికగా కూడా విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్… కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని ట్విట్ట‌ర్‌లో బ్లాక్ చేశారు. ఈ విష‌యాన్ని రాజగోపాల్ రెడ్డి శుక్ర‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గానే వెల్ల‌డించారు. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆయ‌న చేసే ట్వీట్లు ఇక రాజ‌గోపాల్ రెడ్డికి క‌నిపించ‌వు.

Rajagopal Reddy Hits Back At Telangana Congress Chief

కేటీఆర్ చ‌ర్య‌పై కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ద్రోహుల జాడ చెప్ప‌లేక భ‌య‌ప‌డి త‌న‌ను కేటీఆర్ బ్లాక్ చేశారంటూ ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌ ద్రోహులు ఇచ్చిన కానుక‌లు స్వీక‌రించి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన మీరు… వారికి భ‌య‌ప‌డ‌కుండా ఎందుకు ఉంటారని కూడా కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. చివ‌కికి టీఆర్ఎస్ ఉద్య‌మ ద్రోహుల‌తో నిండిపోయింద‌ని ఒప్పుకున్నందుకు కృత‌జ్ఞ‌తలు అంటూ రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news