టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్- కేటీఆర్.

-

సమైక్య పాలనలో కరెంట్ కష్టాలు, విత్తనాలు, ఎరువులు కొనబోతే లాఠీఛార్జీలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుకు ప్రభుత్వ మద్దతు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశంలో మొదటిస్థానంలో ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని కేటీఆర్ అన్నారు. రైతుబంధు ఉత్సవాలపై కేటీఆర్ స్పందించారు. సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. గతంలో పాలమూరు తో పాటు ఇతర జిల్లాల రైతులు పట్నాలకు పోయి కూలీ చేసుకునే పరిస్థితి నుంచి మళ్లీ సొంత ఊళ్లకు తిరిగి వస్తున్నారని అన్నారు.

ఆ నాడు వడ్డీ వ్యాపారులు రైతుల్ని పీక్కు తిన్నారని గుర్తు చేశారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. పచ్చని పొలాలు, పంట భూములు, మత్తడి పారే చెరువులు కనిపిస్తాయని అన్నారు. దీనికంతటికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు. తెలంగాణలో ఎకరం రూ. 10-15 లక్షలకు తక్కువగా భూమి ధరలు లేవని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అతి తక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గణనీయంగా ఆత్మహత్యలను తగ్గించామని ఆయన అన్నారు. తెలంగాణ రైతులు పండించిన పంటను కేంద్రం కూడా కొనలేని స్థితికి వచ్చింది. రైతుబంధు ద్వారా కేసీఆర్ రూ. 50 వేల కోట్లు రైతులను ఆదుకుంది అని అన్నారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా రైతుబంధు తీసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news